Sunday, September 8, 2024

MDK : నీలం మధుని గెలిపించుకుంటాం

మెదక్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా బరిలో నిలిచిన యువ నేత నీలం మధు ముదిరాజ్‌ని పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. చిట్కుల్ లోని క్యాంపు కార్యాలయానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున నాయకులు చేరుకొని నీలం మధును కలిసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు.

- Advertisement -

ఇవాళ‌ళ నర్సాపూర్ మండలం తుగ్లరాంపేట తండాకు చెందిన మాణిక్యరావు, వర్గల్ కు చెందిన చక్రవర్తి టీం, వెల్టూర్ సదాశివపేట కు చెందిన హిందూ మద్దూర్ సభ స్టేట్ ప్రెసిడెంట్ మల్లేశం, మధు, లక్ష్మణ్, రమేష్, రాములు, అలాగే సిద్దిపేటకు చెందిన పలువురు, 15 మంది క్రిస్టియన్ చర్చిల ఫాదర్లు, అమీన్పూర్, దాదిగూడెం, జిన్నారం, నాసిపూర్, నందిగామ, కంది, సంగారెడ్డి పట్టణానికి చెందిన నేతలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని నీలం మధుని కలుసుకున్నారు.

ఈ సందర్భంగా నీలం మధుని శాలువాలతో సన్మానించి, సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో తామంతా నీ వెంటే ఉండి, గెలిపించుకుని తీరుతామని నీలం మధుకి భరోసా ఇస్తున్నారు.

మెదక్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు గ్రామ గ్రామానా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని ముఖ్య నేతలు, కార్యకర్తలు నీలం మధుకి హామీనిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement