Sunday, September 15, 2024

MDK: ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలి… ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా పట్టా పాస్ పుస్తకం ప్రామాణికంగా తీసుకొని రుణాలు మాఫీ చేయాలని ఆయన కోరారు. అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement