Tuesday, September 24, 2024

TG | విద్యుత్ షాక్ తో రైతు మృతి ….

నర్సాపూర్, (ప్రభ న్యూస్) : నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట గ్రామంలో విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కౌలు రైతు గుండం మల్లేష్ (38) కౌలు తీసుకున్న పొలం వద్ద స్తంభం నుండి స్టార్టర్ డబ్బా కు ఉన్న వైరును మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు.

మల్లేష్ కు ఉన్న 10 గుంటల వ్యవసాయం భూమితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి పొలాన్ని కౌలుకు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలు అక్షయ (16), అక్షిత (14), అరుణ (12) లు ఉన్నారు. మల్లేష్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.

మల్లేష్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మల్లేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివ కుమార్, ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీ అశోక్, మాజీ సర్పంచ్ విజయ భాస్కర్ రాజు ఇతర గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement