Saturday, June 29, 2024

TG | ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్..

నర్సాపూర్, (ప్రభ న్యూస్) : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. రాహుల్ రాజ్ త‌న‌ కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా మెదక్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మెదక్ నుంచి నర్సాపూర్ చేరుకున్నారు. అనంతరం సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. సామాన్యుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement