Friday, September 6, 2024

MDK: త్వరలోనే… డబుల్ బెడ్ రూం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం

అకామ్ సంస్థ ద్వారా మంచినీటిని అందించడం సంతోషం
డబుల్ బెడ్ రూంలలో నివసించే వారందరి సమస్యలను పరిష్కరిస్తా
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
త్వరలోనే మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ డబుల్ బెడ్ రూం కాలనీ యందు సీసీ రోడ్డు నిర్మాణం చేపడ్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం ఆటోమెటిక్ క్లోరినేషన్ ఆన్ లైన్ మానిటరింగ్, మున్సిపల్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన సురక్షితమైన త్రాగునీటి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డబుల్ బెడ్ రూం నందు త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడ్తామని ఆయన హామీనిచ్చారు. డబుల్ బెడ్ రూంలలో నివసించే వారి సమస్యలను త్వరలోనే తీర్చుతానని ఆయన అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తున్న అకామ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ లు ఆవారి శేఖర్, దాయర లింగం, మేడి మధుసూదన్, లక్ష్మినారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్, ఉప్పల రాజేష్, జీవన్ రావ్, మందుగుల గంగాధర్, పరుశురాం, బాని, సంతోష్, రాగి అశోక్, గోదల సాయి, నరేష్, సమీ, ఎస్.డి. క్రిష్ణ, లక్ష్మణ్, నాగరాజు, అమీర్, మన్నె సుదర్శన్, దుర్గప్రసాద్, పోచేందర్, సంగమేశ్వర్, అశోక్, ఆన్ మోల్ సంస్థ ప్రతినిధులతో పాటు మున్సిపల్ కమీషనర్ జాకనీశ్రీరాంతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement