Friday, October 18, 2024

బీజేపీకి దేశద్రోహ చరిత్ర తప్ప దేశభక్తి లేదు : తమ్మినేని వీరభద్రం

బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తున్నదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో అమరవీరుల సంక్షేమ సభకు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీకి దేశద్రోహ చరిత్ర తప్ప దేశభక్తి లేదని మండిపడ్డారు. స్వాతంత్ర పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. గాంధీజీని చంపిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉందని ఘాటుగా విమర్శించారు. కార్పొరేట్‌ శక్తుల కొమ్ముకాస్తూ ఆ పార్టీ దేశాన్ని అంధకారంలోకి నెడుతుందన్నారు. సంపన్న వర్గాల మేలు కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశ విభజన జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీని ఢీకొట్టే దమ్ము టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉందన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే మద్దతు ప్రకటించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement