Tuesday, September 17, 2024

Sangareddy: మహబూబ్ సాగర్ చెరువులో చేపలు మృత్యువాత…

సంగారెడ్డి, ఆగస్టు 21 (ప్రభ న్యూస్) : సంగారెడ్డి పట్టణంలో ఉన్న మహబూబ్ సాగర్ పెద్ద చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలడంతో మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు.

బుధవారం ఉదయం చెరువులోని చేపలు చనిపోయి నీటిపై తేలాయి. చెరువులోని నీరు కలుషితంగా మారడం వల్ల చనిపోయాయా లేక మరి ఏ ఇతర కారణాల వల్ల చనిపోతున్నాయన్న విషయం చర్చనీయాంశంగా మారింది. చెరువులో చేపలు చనిపోయిన విషయంపై జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో పాటు, ఫిషరీస్‌ అధికారులకు సమాచారం అందించామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement