Tuesday, October 1, 2024

Medak – రెండు లారీలు ఢీ – నలుగురు దుర్మరణం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ వేగంగా ఢీ కొట్టింది. వెనుకలారీలో ఉన్న అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement