Friday, September 6, 2024

Breaking: పోలీసుల అదుపులో మావోయిస్టు… కాసేపట్లో కోర్టు ముందుకు

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కరీంనగర్ రూరల్ పోలీసులు మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచిలో మావోయిస్టు అమితాబ్ బాగ్చి అలియాస్ అమిత్ ని కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు నిర్వహించారు. కాసేపట్లో కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.

మావోయిస్టు అమితాబ్ పై 2008 లో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుండి పరారీలో ఉండడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు రాంచి జైల్లో ఉన్న మావోయిస్టు అమిత్ ను అదుపులోకి తీసుకొని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టన్నారు. మావోయిస్టును అదుపులోకి తీసుకున్న విషయం కరీంనగర్ లో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement