Thursday, September 12, 2024

TG: గంజాయికి అడ్డాగా మణుగూరు…. రేగా కాంతారావు

మణుగూరు, ఆగ‌స్టు 21(ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతం అసాంఘీక కార్యకలపాలకు అడ్డాగా మారిందని, నిత్యం యువత గంజాయికి బానిసలవుతున్నారని, దీంతో వారి జీవితాలు నాశనం అవుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… మణుగూరు ప్రాంతంలో రాత్రి సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కాలేజీ, హైస్కూల్, నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డ్, పీవీ కాలనీలోని వాటర్ ట్యాంక్ ప్రాంతాల‌ను యువత అడ్డాలుగా చేసుకొని గంజాయి సేవిస్తున్నారన్నారు.

అంతే కాకుండా గంజాయికి బానిసలైన యువత రహదారులపై ప్రయాణించే పలువురిపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. చిన్న వయస్సులోనే గంజాయికి అలవాటు పడి, చదువులను మధ్యలోనే వదిలేసి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు దృష్టి సారించి, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement