Thursday, October 17, 2024

TG: స‌మ‌స్య‌ల‌పై ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టిని క‌లిసిన మ‌ణికొండ కాంగ్రెస్ నేత‌లు

రాజేంద్రనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జి, మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ అధ్వర్యంలో మణికొండ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను క‌లిశారు. మున్సిపాలిటీలో జనభా అనుగుణంగా ఏరియా ఆసుపత్రి, సబ్ స్టేషన్, జూనియర్ కళాశాల, అగ్నిమాపక కేంద్రం మంజూరు చేయాలని కోరడం జరిగింది. ఇది వరకు మంజూరై అగిపోయిన ఇబ్రహీంబాగ్, నెక్నాంపూర్ చెరువు పనులు మళ్లీ ప్రారంభించాలని కోరారు.

కనెక్టివిటీ రోడ్ల‌ సమస్య కూడా త్వరగా పరిష్కరించాలని అడిగారు. నియోజకవర్గంలో సమస్యలపై కూడా ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలని మంత్రిని కోరారు. మణికొండ పార్టీ అధ్యక్షుడు జితేందర్ ఇబ్రహీంబాగ్ చెరువు సమస్య, దోమల సమస్యకు శాశ్వత పరిష్కారం ఐన చెరువు అభివృద్ధి పనులు త్వరగా పునఃప్రారంభించాల‌ని అభ్యర్థించారు. అన్ని విషయాలపై సమీక్షా సమావేశం చేసి సమస్యల పరిష్కారం చేద్దామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్ర‌మార్క మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మి నారాయణ, కో ఆప్షన్ తాజ్, సీనియర్ నాయకుడు ముత్యాలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement