Monday, October 21, 2024

Malasia – దశాబ్ది ఉత్సవాలకి రండి – కేటీఆర్ కి ఆహ్వానం

హైదరాబాదు – మలేషియా తెలంగాణ అసోసియేషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీ హాజరుకావాలని అసోసియేషన్ ఆహ్వానించింది..

వచ్చే నెల నవంబర్ 9వ తేదీన మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగే ఈ దశాబ్ది ఉత్సవాలకి మలేషియాలోని తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపింది.

హైదరాబాద్ లో ని నంది నగర్ కేటీఆర్ నివాసంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్ కి ఆహ్వానం అందించారు.

కేవలం మలేషియాలోని తెలంగాణ వాసులే కాకుండా అనేక దేశాల నుంచి ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రముఖులు హాజరు కానున్నారని కేటీఆర్ కి తెలియజేశారు.

- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్లిన ఏ దేశం వెళ్లిన తెలంగాణ ప్రాంతీయులు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని కేటీఆర్ అన్నారు.గుర్తు చేశారు. మలేషియాలోనూ తెలంగాణ వాసులు తమకంటూ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని అనేక రకాల కార్యక్రమాల్లో తెలంగాణ గడ్డతో మమేకం కావడం పట్ల అభినందనలు తెలియజేశారు.

ఈ ప్రస్థానంలో 10 సంవత్సరాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నేతలు కార్తీక్ రెడ్డి, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement