Thursday, September 12, 2024

MBNR: డీసీసీబీ నూతన చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక‌..

మహబూబ్ నగర్, ఆగస్టు 23 (ప్రభ న్యూస్) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన చైర్మన్ గా వనపర్తి జిల్లాకు చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎన్నికైన చైర్మన్ కు ఎన్నికల నిర్వహణ అధికారి టైటస్ పాల్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు,డైరక్టర్లు నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈసంద‌ర్భంగా నూతన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… అందరి సహకారంతో రైతు సంక్షేమానికి కృషి చేస్తూ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మేఘా రెడ్డి, డాక్టర్ పర్నికా రెడ్డి, జీఎంఆర్, అనిరుధ్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement