Thursday, September 19, 2024

వాణిదేవి గెలుపు పట్ల నేతల సంబరాలు

దేవరకద్ర : హైద్రాబాద్‌ , రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సిగా గెలుపొందిన వాణిదేవి గెలుపు పట్ల నియోజకవర్గ పరిధిలోని సిసికుంట మండల కేంద్రంలో టిఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సిగా వాణిదేవి గెలుపు పట్ల ప్రతిపక్షాలకు చెంప చెళ్లుమనదని టిఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. స్థానిక బస్టాండ్‌ కూడలి వద్ద టిఆర్‌స్‌ నాయకులు బాణాసంచా కార్యక్రమాలు నిర్వహించి ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాములు , ఎంపిపి హర్షవర్దన్‌ రెడ్డి, సర్పంచ్‌ మోహన్‌ గౌడ్‌ , దేవస్థానం చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షులు రాము , పార్టీ సర్పంచ్‌లు , ఎంపిటిసిలు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement