Friday, July 5, 2024

MBNR: విద్యుత్ షాక్ తో.. మూడు ఆవులు మృతి… 

అడ్డాకుల, జులై 3 (ఆంధ్ర ప్రభ) : అడ్డాకుల మండల పరిధిలోని పొన్నకల్లు గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ కు గురై మూడు పాడి ఆవులు చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతుల సమాచారం మేరకు ఉదయం ఏడు గంటలకు పశువుల మేత కోసం పశువుల కాపరి ఆవులను తరలిస్తుండ‌గా… విద్యుత్ వైర్లు తెగిపడి ఉండడంతో విద్యుత్ వైర్లకు ఆవులు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.

గమనించిన పశువుల కాపరులు సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చేలోపు మూడు ఆవులు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతిచెందిన ఆవులు రైతు సింగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందినవి. వాటి విలువ 1,50,000 ఉంటుందని బాధిత రైతు సింగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గ్రామస్తులు హేమవర్ధన్ రెడ్డి ధర్మారెడ్డి తెలిపారు. పాడి ఆవులు విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో వాటి కుటుంబం వీధిన పడిందని ప్రభుత్వ పరంగా ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు, బాధిత రైతు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement