Friday, October 4, 2024

TG | బస్సు ఢీకొని ఇద్దరు మృతి..

కోయిలకొండ, (ప్రభ న్యూస్) : ఆర్టీసీ బస్సు , బైక్‌ను ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన కోయిలకొండ మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కోయిలకొండ మండలం బూరుగ్‌పల్లి గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మయ్య… ఇద్దరూ అన్నదమ్ములు. ద్విచక్ర వాహనంపై మహబూబ్ నగర్ వెళ్తుండగా పారుపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement