Tuesday, October 1, 2024

MBNR: శభాష్.. ఎస్సై సంతోష్

మానవత్వం చాటుకున్న శాంతి నగర్ ఎస్సై సంతోష్
జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీలోని మీసేవ సెంటర్ సమీపంలో ఆకలితో వృద్ధ మహిళ సృహ తప్పి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి, ఎస్ఐ సంతోష్ కు తెలిపారు. వెంటనే స్పందించిన సంతోష్ తమ సిబ్బందిని పంపి, స్థానిక వైద్యులతో ప్రథమ చికిత్స నిర్వహించి, ఆహారం అందించి కోలుకునేలా చేసి ఆమె వివరాలు సేకరించారు.

కలుకుంట్ల గ్రామానికి చెందిన మహిళగా గుర్తించి భర్త సవారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెను బాగా చూసుకోవాలని సూచించారు. ఇలా వృద్ధ వయస్సులో ఇబ్బందులు కల్గించకూడదని, అమ్మ లేనిదే మనంలేమని, ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement