Sunday, July 7, 2024

MBNR: జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎంపీ డీకే అరుణ..

కొత్తూరు, జులై 4 (ప్రభ న్యూస్): కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపీ డీకే అరుణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచి మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఆమెకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖద్వారం అయిన తిమ్మాపూర్ గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ కో కన్వీనర్ అమడాపురం నరసింహ గౌడ్, కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎర్రవెల్లి నాగరాజు చారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డీకే అరుణకు పుష్పగుచ్చం అందజేసి పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement