Friday, September 20, 2024

విశ్రాంత ఎంఈఓ మృతి

దేవరకద్ర : దేవరకద్ర విశ్రాంత ఎంఈఓ రాజారావు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. గతంలో దేవరకద్ర ఎంఈఓగా రాజారావు పని చేశారు. గత వారం రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేక హైద్రాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజారావు మండల విద్యాధికారిగా పనిచేసినప్పుడు విద్య అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని ఉపాధ్యాయులు అన్నారు. రాజారావు మృతి పట్ల ఆయనతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు అలాగే బ్రాహ్మణ సంఘం వారు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement