Thursday, September 19, 2024

భక్తులతో మన్యం కొండ పులకింత

దేవరకద్ర : తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానంలో భక్తులతో పులకించిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మన్యంకొండకు తరలివస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. దేవాలయంలో వెంకన్న స్వామికి భక్తి శ్రద్దలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలతో పూలతో అలంకరణలు చేశారు. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ భక్తులు కాలినడకన స్వామివారి దర్శనం కోసం మన్యంకొండకు తరలివస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ , ఈఓ శ్రీనివాస రాజు , నిత్యానంద చారి తెలిపారు. శనివారం , సోమవారం మన్యంకొండ దేవస్తానంలో వెంకన్న సన్నిధిలో భక్తుల సందడి పెరుగుతూ వస్తున్నదని వారు చెప్పారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకుంటున్నారు. దుకాణాలు కూడా భక్తుల తాకిడితో కిటకిటలాడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement