Thursday, September 19, 2024

బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి కాపీ..


దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని సిసికుంట మండల పరిధిలోని దమఘనాపురం గ్రామానికి చెందిన సద్దాం అనే వ్యక్తికి హైద్రాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లక్షా యాభైవేల ఎల్‌ఓసి కాపీని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని , దానిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement