Tuesday, September 17, 2024

MBNR: భూత్పూర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే..

మక్తల్, ఆగస్టు 8 (ప్రభ న్యూస్) : నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పునరావాస కేంద్రాల పరిశీలనలో భాగంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వ‌ర్యంలో భూత్పూర్ ముంపు గ్రామంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇవాళ మధ్యాహ్నం పర్యటించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్థానిక నాయకులు గ్రామంలోని వీధులన్నింటిని జిల్లా కలెక్టర్ కు చూయించి అక్కడి దుస్థితిని వివరించారు.

భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి కొన్ని సంవత్సరాలవుతున్నా… నేటికీ ఈ గ్రామాన్ని పునరావాస కేంద్రంగా ప్రకటించకపోవడం ఇప్పుడు ఉంటున్న ఊరిలోకి రిజర్వాయర్ నీళ్ళు ఊట ఊరుతోంది. తద్వారా గ్రామస్థులు కొత్త నివాసాలను నిర్మించుకోలేక, వీరి జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైందని, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

పునరావాసం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు గ్రామస్థులు విన్నవించారు. భూత్పూర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పునరావాస‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పునరావాస కేంద్రాల పరిశీలన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్, ఆర్డీఓ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్మయ్య గౌడ్, భీమ్ సేన్ రావు, రఘుపతి రెడ్డి, చెన్నయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement