కోస్గి : ప్రజలందరూ మాస్కు ధరించి అప్రమత్తంగా ఉండాలని 7వ వార్డు కౌన్సిలర్ మంజుల శ్రీనివాస్ అన్నారు. వార్డులోని సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ను కాలనీలో స్ప్రే చేశారు. శ్రీరామ కాలనీ లో ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాలని వారు కోరారు. వారు మాట్లాడుతూ కరోనా కోరలు చాస్తున్న సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మాస్కు ధరించి శానిటైజర్ వేసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లొద్దని ముఖ్యంగా చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కరోన వైరస్ రోజురోజుకు విస్తరిస్తోందనీ, పట్టణ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి తమ పనులు నిర్వహించుకోవాలని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement