Tuesday, October 1, 2024

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలలో విజేత గద్వాల జిల్లా ఎద్దులు

అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలలో విజేత గద్వాల జిల్లా ఎద్దులు మొదటి బహుమతి 40 వేలు,,ద్వితీయ 30 వేలు,,తృతీయ 20 వేలువనపర్తి మార్చి 13 ప్రతినిధి:శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాన్గల్ మండలం రేమద్దుల గ్రామం లో శివ శంకర హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను ఘనంగా నిర్వహించారు….ఇట్టి బండలాగుడు పోటీలలో విజేతలకు గ్రామ సర్పంచ్ మంజుల తిరుపతయ్య,, ఎంపీటీసీ పత్తికొండ కరుణాకర్ రెడ్డి లు నగదు బహమతులను అందజేశారు.. గద్వాల కు చెందిన సతీష్ రెడ్డి ఎద్దులు విజేత గా నిలువడంతో ఎద్దులు యజమానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పంపిన 40 వేల నగదును అందజేశారు.. కర్నూలు కు చెందిన యుగంధర్ ఎద్దులు ద్వితయ స్థానంలో నిలువగా 30 వేల రూపాయలను మాజీ ఉప సర్పంచ్ మోటు రాములు అందజేశారు.. పాలెం మహేశ్వర రెడ్డికి చెందిన ఎద్దులు మూడవ స్థానంలో నిలువగా 20000 రూపాయలను గ్రామానికి చెందిన బాల్ రెడ్డి డి కృష్ణయ్య లు అందజేశారు… నాల్గవ స్థానంలో అనంతపురం జిల్లా చెన్నయ్య కు చెందిన ఎద్దులు నాలుగవ స్థానంలో నిలువగా 15 వేల రూపాయలను పల్లె జైపాల్ రెడ్డి అందజేశారు…కర్నూల్ కు చెందిన దాసు ఎద్దులు ఐదవ స్థానంలో నిలువగా పదివేల రూపాయలను సంపంగి రాములు అందజేశారు…వనపర్తి గోపాకృష్ణ కు చెందిన ఎద్దులు ఆరవ స్థానంలో నిలువగ బాలకృష్ణ ఐదువేల రూపాయలను అందజేశారు.. అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలలో 12 జతల ఎద్దులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు..ఈ కార్యక్రమంలో నాయకులు రంగాపురం శివారెడ్డి,,తిరుపతయ్య,, యాదగిరి చారి,, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement