Saturday, July 6, 2024

Liquor Scam – క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల‌ 25 వరకు కోర్టు పొడిగించింది. నేటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణను రౌజ్ అవెన్యూ కోర్టు జూలై 25కి వాయిదా వేసింది. 24 రోజుల తరువాత కవితను అధికారులు మళ్లీ కోర్టుకు ముందుకు హాజరు పరచనున్నారు. అయితే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న కోర్టు కవితకు జూలై 25వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement