Thursday, October 3, 2024

Legal Battle – కొండా సురేఖ‌పై నాగార్జున న్యాయ పోరాటం

హైదరాబాద్ – త‌న ప‌ట్ల‌,త‌న కుటుంబ ప‌ట్ల , మ‌న మాజీ కోడ‌లు స‌మంత ప‌ట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ‌పై న్యాయ పోరాటం చేస్తాన‌ని న‌టుడు నాగార్జున ప్ర‌క‌టించారు.. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. తాను ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో ఉన్నాన‌ని, హైద‌రాబాద్ వచ్చిన అనంత‌రం ఆమెకు లీగ‌ల్ నోటీస్ పంపుతాన‌ని తేల్చి చెప్పారు.. అన‌వ‌స‌రంగా త‌మ కుటుంబాన్ని బ‌జారుకీడ్చిన కొండాను ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలేది లేద‌న్నారు. కాగా, కొండా త‌న వ్యాఖ్య‌ల‌కు స‌మంత‌కు సారీ చెప్పిన‌ప్ప‌టికీ నాగార్జున ఫ్యామిలీ మాత్రం చెప్ప‌లేదు.. దీంతో నాగార్జున స్పందించి న్యాయ పోరాటానికి సిద్ద‌మ‌య్యారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement