Sunday, September 8, 2024

KTR’s Twit – ఇక్క‌డా ఆర్టీసీ ఛార్జీల మోత త‌ప్ప‌దు …

హైదరాబాద్‌: ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదని పేర్కొన్నారు.


కాగా, కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనున్నది. రాష్ట్రంలో త్వరలో బస్సు చార్జీలు భారీ స్థాయిలో పెరుగనున్నాయి. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. దీనిని కోట్ చేస్తూ కెటిఆర్ తెలంగాణాలోనూ చార్జీల వాత త‌ప్ప‌దంటూ పేర్కొన్నారు..

- Advertisement -

https://twitter.com/KTRBRS/status/1812683738721177854

Advertisement

తాజా వార్తలు

Advertisement