Thursday, October 24, 2024

TG | వారి ఆందోళ‌న‌కు కేటీఆర్ సంఘీభావం

నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లిలోని ఏడో బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ భార్యలు రోడ్డెక్కి నిర‌స‌న చేప‌ట్టారు. జాతీయ రహదారి 44పై వారు నిరసన తెలిపారు. తమ భర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారంతా డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ మార్గమధ్యలో ఆందోళన చేస్తున్న ఏడో బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలకు సంఘీభావం ప్ర‌క‌టించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత తొందరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. తొందరగా ఈ సమస్యను తేల్చకుంటే పార్టీ తరఫున వారికి అండగా ఉండి.. అవసరమైతే నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement