Friday, October 18, 2024

TG: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 38ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు.

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. రాజేంద్రప్రసాద్ ను ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపాన్ని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement