Monday, July 1, 2024

Tributes – సాయిచంద్ కు కెటిఆర్ ఘన నివాళి ….

హైద‌రాబాద్ : చిర‌కాలం మా గుండెల్లో నిలిచిపోయే త‌మ్ముడు సాయిచంద్ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సందర్బంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముందుగా సాయిచంద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.


అనంతరం మాట్లాడుతూ.. సాయిచంద్‌ మ‌ర‌ణించి ఏడాది అవుతుందంటే ఎవ‌రం న‌మ్మ‌లేక‌పోతున్నాం. త‌న‌ మాట‌తో, పాట‌తో అద్భుత‌మైన వాగ్దాటితో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఉర్రూతలూగించిన‌ అద్భుత క‌ళాకారుడు సాయిచంద్. మ‌న అంద‌రి ఆప్తుడు.. చిర‌కాలం మా గుండెల్లో నిలిచ‌పోయే త‌మ్ముడు. భ‌విష్య‌త్‌లో సాయి కుటుంబం కోసం ఎల్ల‌వేళ‌లా పార్టీ త‌ర‌పున ఆ కుటుంబానికి అండ‌గా ఉంటాం. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఎలా అండ‌గా ఉన్నామో భ‌విష్య‌త్‌లో కూడా ఉంటాం. సాయి జ్ఞాప‌కార్థం పాటల‌ సీడీలు, సంక‌ల‌నాలు, పుస్త‌కాలు తీసుకొచ్చిన సోద‌రుల‌కు అభినంద‌న‌లు. త‌మ్ముడి ఆత్మ శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను అని కోరుకుంటూ కేటీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement