Friday, September 13, 2024

TG: కేటీఆర్ జైలుకు పోవ‌డం ప‌క్కా… బండి సంజ‌య్

కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయ‌న‌ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ…. త‌నతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదన్నారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమేన‌న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామ‌న్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అన్నారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని బండి సంజ‌య్ అన్నారు.

కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం?… అని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే… బీజేపీకి సంబంధముందా ? అన్నారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్సే న‌న్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంద‌న్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదన్నారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే త‌మ బ్రాండ్ అంబాసిడర్లన్నారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు.

పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని హరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామమ‌న్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందన్నారు. తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ లో లుకలుకలు మొదలైనయన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా ? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందన్నారు.

- Advertisement -

పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా… ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రిబ్బన్ కటింగ్ చేశారు కదా ?
అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలన్నారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయం ? వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? అని ప్ర‌శ్నించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి… పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే… వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. తాను అందరి మనిషిని… కొందరు కాదనుకుంటే నేనేం చేయగలను.. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదన్నారు. త‌న పార్లమెంట్ పరిధిలో 80శాతానికిపైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తాన‌న్నారు. రాష్ట్ర అధక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారన్నారు. హైకమాండ్ నిర్ణయమే త‌మకు శిరోధార్యమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement