Sunday, September 8, 2024

మోటర్లకు మీటర్లు పెట్టే మోడీ దేవుడు ఎలా అవుతారు – కేటీఆర్

సిరిసిల్ల – .మోడీ దేవుడు అంటున్నారు ఆయన సిలిండర్ ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు ,రైతుల మోటార్ల కు మీటర్లు పెడతానని అన్నారు వారు దేవుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మోడీ ఏమి చేశారు రాష్ట్రానికి అని అడిగారు.ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చారా.జన దన ఖాతాలలో 12 లక్షలు వేస్తానని అన్నారు వేశారా అని అడిగారు. బిజెపి వారికి మనకు ఏమి చేశారు అన్నది చెప్పే మొఖం లేదని విమర్శించారు..

మతాలు,కులాలతో గొడవలు పెట్టడమే వారి పని అని అన్నారు. వందే భారత్ రైలు ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారని అన్నారు. .గృహ లక్ష్మి పథకాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నామని, ఇల్లు కట్టు కొనే వారికి 3 లక్షలు ఇస్తాను అని అన్నారు .భూమి లేని వారికి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇల్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.వంద శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని, కొందరికి రాక పోవడంతో వారు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అని,v వాటిని నమ్మవద్దని మంత్రి కోరారు.గ్రామాలలో అన్ని రకాల మాలిక వసతుల కల్పన కు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement