Sunday, September 8, 2024

ఓపిక నశిస్తే తన్నీ తరిమేస్తాం – మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా – ఓపిక నశిస్తే తన్ని తరిమేస్తమని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ బిజెపి నాయకులను హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన మహానాయకుడు కెసిఆర్ పై కాంగ్రెస్, బిజెపి నాయకులు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సహనం కోల్పోయి, ఓపిక నశిస్తే తన్ని తరిమేసే బలం టిఆర్ఎస్ కార్యకర్తలకు ఉందన్నారు. 2001లో చీకటి లో చిరుదివ్వె లాగా కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించి 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ పథకాలను కొనియాడుతున్నా రాష్ట్ర బిజెపి నాయకులకు కనబడక పోవడం సిగ్గుచేటన్నారు. సభ్యత్వ నమోదు లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement