Tuesday, September 17, 2024

Kothagudem – రేవంత్ చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం

పూసుగూడెంలో పైలాన్ అవిష్క‌ర‌ణ
మోటార్ ఆన్ చేసి కాలువ‌కు నీళ్లు విడుద‌ల‌
మంత్రుల‌తో క‌ల‌సి గోదావ‌రికి పూజ‌లు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – కొత్తగూడెం భద్రాచలం : లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నేటి మ‌ధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకున్న ఆయ‌న ముందుగా సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్‌ ఆవిష్కరించారు.. అనంత‌రం దిగువ కాలువ‌లోని నీళ్లు విడుద‌ల కోసం మోటర్‌ స్విచ్‌ ఆన్ చేశారు… ఆ త‌ర్వాత మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిల‌తో క‌ల‌సి గోదావరి జలాలకి పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement