Saturday, June 29, 2024

TS : తెలుగులో ప్రమాణం చేసిన కిషన్‌ రెడ్డి..

న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు.

తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభమవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement