Wednesday, October 23, 2024

Khanapur – కవ్వాల టైగర్ జోన్ సమస్యలు పరిష్కరించండి – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వినతి

జన్నారం ,అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ జోన్ లోని పలు సమస్యలు పరిష్కరించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి ఆర్. ఎం.డొబ్రియల్ కు వినతి పత్రం అందజేశారు. హైదరాబాదులోని ప్రధాన అటవీశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయనను ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందజేశారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ వాహనాల రాకపోకలకు,రహదారుల వెడల్పుకు అనుమతించాలని,తదితర సమస్యలను పరిష్కరించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, సయ్యద్ ఇసాక్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement