Wednesday, October 9, 2024

TG: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం…

జూలూరుపాడు, అక్టోబర్ 9 (ప్రభ న్యూస్) : మండలంలోని కొమ్ముగూడెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవాని దీక్షలో ఉన్న ఇరువురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. బుధవారం సాయంత్రం తల్లాడవైపు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వస్తున్న ఆటోలు ఎదురెదురుగా ఢీకొనటంతో ప్రమాదం జరిగింది.

ఆటో నడుపుతున్న డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తులు మహబూబాద్ ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు యాక్సిడెంట్ జరిగిన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement