Thursday, July 4, 2024

Sattupalli – ఆర్జీసీ బ‌స్సు – అయిల్ ట్యాంక‌ర్ ఢీ … 12 మందికి గాయాలు

సత్తుపల్లి: ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. ఈక్రమంలో రాజమహేంద్రవరం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిష్టారం సమీపంలో అదుపుతప్పి బస్సును ఎదురుగా ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement