Wednesday, July 3, 2024

KHM: ఘనంగా ప్రైడ్ ఇండియా అవార్డ్స్..

ఉత్తమ సేవలందించిన వైద్యులకు డా.బి.సి.రాయ్ నేషనల్ అవార్డు
ముఖ్య అతిథులుగా ఫ్యామిలీ కోర్టు జిల్లా జడ్జి అర్చన కుమారి
ఖమ్మం, జులై 1 : ఖమ్మం నగరంలోని టీటీడీసీ భవనం నందు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రైడ్ ఇండియా అవార్డ్స్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల వేణుగోపాల్ ఆద్వర్యంలో ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫ్యామిలీ కోర్టు జిల్లా జడ్జి అర్చన కుమారి, ఎన్ఆర్ఐ ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ చైర్మన్ బోనాల రామ కృష్ణ,పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చన కుమారి మాట్లాడుతూ… జాతీయ వైద్యుల దినోత్సవం డా.బి.సి.రాయ్ పేరు మీద జరపడం, అలాగే ఉత్తమ సేవలందించిన వైద్యులకు ఆయన పేరు మీద నేషనల్ అవార్డు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయమ‌న్నారు. డాక్టర్ లు దేవుళ్ళతో సమానమ‌ని, ఈ గౌరవం ఎప్పటికీ నిలబెట్టుకోవాలని ఆమె తెలిపారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్, డాక్టర్ కావ్య, డాక్టర్ స్రవంతి గైనకాలజిస్ట్ లను డా.బి.సి.రాయ్ నేషనల్ అవార్డులను అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ, ఆయుష్మాన్ భారత్ ఖమ్మం జిల్లా సి.ఎమ్. ఓ రాజ శేఖర్, డా.గోపి కృష్ణ, శారద కాలేజీ నర్సింగ్ విద్యార్దులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement