Saturday, September 7, 2024

KHM: విద్యుత్ సబ్ స్టేషన్ లో పేలిన కెపాసిటర్ సెల్…

మంటలార్పడంతో సబ్ స్టేషన్ కి తప్పిన పెను ప్రమాదం….
కారేపల్లి, జులై 26 (ప్రభ న్యూస్) : కారేపల్లి మండల పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో గల కెపాసిటర్ సెల్ అతి వేడికి గురై శుక్రవారం మధ్యాహ్నం భారీ శబ్దంతో పేలిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడి సబ్ స్టేషన్ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. అక్కడే ఉన్న ఏఈ విజయకుమార్, సిబ్బంది కలిసి వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి నీటితో కెపాసిటర్ లో లేచిన మంటలను ఎంతో శ్రమించి ఆర్పివేశారు.

దీంతో సబ్ స్టేషన్ లోని పెద్ద యంత్రాలకు మంటలు అంటుకోకుండా ఏఈ విజయకుమార్ ఆధ్వర్యంలోని సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది. సబ్ స్టేషన్ లో ఒకేసారి భారీ శబ్దంతో పేలుడు జరగడంతో కారేపల్లి క్రాస్ రోడ్డు వాసులు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురయ్యారు. కాలిపోయిన కెపాసిటర్ విలువ సుమారు 50వేలకు పైగా ఉంటుందని అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement