Thursday, September 12, 2024

TG | కేరళ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ముప్పు…

ఖమ్మం : తిరువనంతపురం – ఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా పాపట్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రైలు (12625) వస్తుండగా రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి బైక్ వదిలి పారిపోయాడు. దాదాపు వంద కి.మీ. మీ వేగంతో ప్రయాణిస్తున్న ఆ రైలు బైక్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో పూర్తిగా ధ్వంసమైంది. అయితే బైక్‌ను ఈడ్చుచెళ్లినప్పుడు రాపిడి జరిగినా…. బైక్‌లోని పెట్రోల్‌కు మంటలు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement