Friday, September 20, 2024

Khammam – వ‌ర‌ద ప్రాంతాల్లో రేవంత్ ప‌ర్య‌ట‌న‌ ….

సూర్యాపేట మీదుగా వెళ్లిన సీఎం
రోడ్డు మార్గంలో ప‌రిశీలిస్తూ ముందుకు
నాగార్జున సాగ‌ర్‌, కోదాడ ప్రాంతాల్లో ప‌రిశీల‌న‌
ఖ‌మ్మంలో బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : వ‌ర‌ద ప్రాంతాల‌ను ప‌రిశీలించ‌డానికి సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరారు. తెలంగాణ‌లో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతాల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌డానికి వెళ్లారు. సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ గండి, కోదాడ ప‌ట్ట‌ణంలోని వ‌ర‌ద ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం మ‌హ‌బూబాబాద్ జిల్లాకు బ‌య‌లు దేరారు. అక్క‌డ మున్నేరు, ఆకేరు న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తారు. అనంత‌రం ఖ‌మ్మం చేరుకుని వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి అనంత‌ర అక్క‌డే బ‌స చేస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement