Tuesday, October 22, 2024

Khammam – నాయకన్ గూడెంలో విషాదం – వాగులో కొట్టుకుపోయి భార్యాభర్తలు మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో తీవ్ర విషాదం నింపింది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంత య్యారు.

ప్రవాహంలో కొట్టుకుపోతున్న మరో యువకుడుని స్థానికులు, పోలీసులు రక్షించారు.పాలేరు అలుగు సమీపంలో ఉన్న సిమెంటు ఇటుకల తయారీ కర్మాగా రంలో ఓ కుటుంబం నివసిస్తోంది. పాలేరు జలాశయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచి వరద పోటెత్తడంతో షేక్ యాకుబ్, భార్య సైదాబి, కుమారుడు షరీఫ్ వరదల్లో చిక్కుకుపోయారు.వరద ఉద్ధృతి పెరగడంతో ప్రవాహంలో గల్లంతయ్యారు.

కొట్టుకుపోతున్న షరీఫ్ ను స్థానికులు, పోలీసులు కాపాడారు. దంపతుల కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement