Friday, September 20, 2024

గుర్తుతెలియని మహిళ మృతదేహం..

కరీంనగర్‌ : నగరంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయనుకున్న తరుణంలో నగరం నడిబొడ్డున ఉండే కోర్టు ప్రహరీ గోడను ఆనుకుని ఉండే డ్రైనేజీ కాలువలో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్‌ కోర్టు ప్రహరీ గోడను ఆనుకొని ఉండే బస్‌స్టాప్‌ ఎంతో మంది ప్రయాణికులు అక్కడికి చేరుకొని బస్సు ఎక్కడానికి వెళ్తుంటారు. ఈ తరుణంలో కొంతమంది బస్టాప్‌లో నుండి వెనుక గల మురికి కాలువలో ఒక మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ విబి కమలహాసన్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసును దర్యాప్తు చేసే అధికారులకు సూచనలు చేశారు. ఈ విషయమై గుర్తు తెలియని మహిళ ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మహిళకు దాదాపు 34 ఏళ్ల వయసు ఉంటు-ందని పోలీసులు అంచనా వేశారు. కోర్టు ముందే గేటుకు కూతవేటు దూరంలోనే హత్య జరగడం సంచలనంగా మారింది. హత్య ఎవరు చేశారు.. ఎక్కడైనా చున్నీతో ఉరివేసి ఈ స్థలానికి తీసుకు వచ్చారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో కైమ్‌ రేటు చాలా తగ్గిపోయిందనే తరుణంలో ఇలాంటి హత్య జరగడం చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. మహిళ చేతిపై ముద్రించుకున్న ముద్రలను కూడా పోలీసులు గమనించి వాటి ఫోటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎంతమంది చేశారు అనే విషయంపై వేచి చూడాల్సిందే..

Advertisement

తాజా వార్తలు

Advertisement