Friday, July 5, 2024

TS: మానవత్వం చాటిన పోలీస్‌ బాస్‌..

అనాథ వృద్ధుడికి అంత్య క్రియలు
వాట్సాప్‌ మెసేజ్‌కు స్పందించిన ఎస్పీ అఖిల్‌ మహాజన్‌
ఎస్సై సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

తంగళ్లపల్లి, జూన్‌ 22 (ప్రభన్యూస్‌): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం కేసిఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ సముదాయంలో కాల్వ లక్ష్మణ్‌ అనే వృద్ధుడు మృతిచెందాడు. అతడికి బంధువులెవరూ అందుబాటులో లేకపోవడం, భార్య చేతిలో చిల్లిగవ్వ కూడా లేక అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొంది.

వృద్ధుడి అంత్యక్రియాలకు సాయం చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌కు వాట్సాప్‌ ద్వారా ఒక యువకుడు మెసేజ్‌ చేసాడు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్‌ను ఆదేశించడంతో ఆయన వెళ్లి సందర్శించి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వంతో స్పందించిన జిల్లా పోలీస్‌ బాస్‌కు మండల వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement