Saturday, September 7, 2024

Peddapalli: మల్టీజోన్‌- 1 పరిధిలో నలుగురు ఇన్స్‌పెక్టర్ల బదిలీ…

పెద్దపల్లి, జులై 11 (ప్రభ న్యూస్‌): మల్టీజోన్‌- 1 పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట సీసీఎస్‌లో పనిచేస్తున్న టి. ప్రవీణ్‌కుమార్‌ను రామగుండం సర్కిల్‌కు, రామగుండంలో పనిచేస్తున్న జి. అజయ్‌ బాబును ఐజీ కార్యాలయానికి, రామగుండం లీగల్‌ సెల్‌లో పని చేస్తున్న ఎన్‌. ప్రసాద్‌రావును గోదావరిఖని టూటౌన్‌కు, గోదావరిఖనిలో టూటౌన్‌లో పని చేస్తున్న రవీందర్‌ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement