Sunday, September 8, 2024

KNR: ఇసుక లోడ్ చేయడం లేదని.. లారీ డ్రైవర్ల రాస్తారోకో

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలోని రేణిగుంట బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారిపై ఇసుక లారీ డ్రైవర్లు రాస్తారోకో చేశారు. గత ఐదు రోజుల నుండి ఇసుక లోడ్ చేయట్లేదని డ్రైవర్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు తెలిపారు.

రాజీవ్ రహదారిపై లారీ డ్రైవర్లు బైఠాయించడంతో హైదరాబాద్ కు వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement