Thursday, September 19, 2024

మట్టి నమూనాలపై రైతులకు అవగాహన

ఓదెల: మండల కేంద్రంలోని ఓదెల క్లస్టర్‌ రైతు వేదికలో సోమవారం మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కునారపు రేణుకాదేవి హాజరై వ్యవసాయ అధికారులతో కలిసి రైతులకు పలు సూచనలు చేశారు. భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఆకుల మహేందర్‌, మాజీ ఎంపీటీసీ బోడకుంట కుమారస్వామి, ఉపసర్పంచ్‌ తీర్థాల కుమారస్వామి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బోడకుంట మహేందర్‌, నూనె శ్రీనివాస్‌, ఏఈఓ సంధ్య, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement