Friday, September 13, 2024

Peddapalli: యుద్ధ ప్రాతిపదికన ఆర్.ఓ.బీ పనులు.. కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాబోయే వర్షాకాలంలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని, శ్రీరాంపూర్ వైపుగా 28 స్లాబ్ లు, 150 మీటర్ల అప్రోచ్, పెద్దపల్లి వైపుగా 18 స్లాబ్ లు, 145 మీటర్ల అప్రోచ్ తో పనులు జరుగుతున్నాయన్నారు.పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ ప్రక్రియ నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, వచ్చే వానాకాలం నాటికి నాణ్యతతో కూడిన ఆర్.ఓ.బీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భావ్ సింగ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement