Friday, September 20, 2024

23న రాజన్న హుండీ లెక్కింపు

వేములవాడ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ ఈనెల 23 మంగళవారం రోజున లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. మహా శివరాత్రి మహోత్సవ వేడుకలు విజయవంతమైన తర్వాత తొలిసారిగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లెక్కింపులో పెద్ద మొత్తం ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు- ఆలయ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థల సామాజిక కార్యకర్తలు పాల్గొననున్నట్లు- ఈవో కృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement